ఆర్ ఎక్స్ 100 కార్తికేయ అదృష్టవంతుడే..

-

ఆర్ ఎక్స్ 100సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తికేయ, ఆ తర్వాతి సినిమాలతో వరుస ఫ్లాపులు తెచ్చుకున్నాడు. హీరోగా హిట్లు రాకపోయేసరికి విలన్ గానూ నటించాడు. అది కూడా ఫెయిలైంది. చాలా మంది కార్తికేయ కెరీర్ పై బెంగ పెట్టుకున్నారు. కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అవకాశం వచ్చేసరికి కార్తికేయకి మంచి సినిమా వస్తుందని భావించారు. చావు కబురు చల్లగా సినిమాతో గీతా ఆర్ట్స్ బ్యానర్లో మన ముందుకు వస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందనే వచ్చింది.

ఇదిలా ఉండగా, తాజాగా కార్తికేయ మరో చిత్రం ప్రారంభమైంది. అది కూడా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో. దానికి సుకుమారే కథ, కథనం, మాటలు అందిస్తుండడం విశేషం. సుకుమార్ సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి అలాంటి బ్యానర్లో కార్తికేయకి అవకాశం రావడమంటే అదృష్టమే. ప్రస్తుతానికి సినిమా తెరకెక్కుతుందని వచ్చిందే గానీ దర్శకుడు ఎవరనేది ఇంకా తేలలేదు. మరి సుకుమార్ శిష్యుల్లో ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news