తెలంగాణ పరువు తీసిన నలుగురు ఎమ్మెల్యే లను బహిష్కరించాలి !

-

టీ.ఆర్.ఎస్ అధికార మదంతో అక్రమాలతో దుష్ట పాలన సాగిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు కళ్ళు నెత్తికెక్కి మంత్రి మల్లారెడ్డి బహిరంగంగా వసూలు చేస్తున్నారని అన్నారు. మంత్రి మల్లారెడ్డి ని ఎందుకు భర్తరఫ్ చేయడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు బెంగళూరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని,  తెలంగాణ పరువు తీసిన ఈ నలుగురు ఎమ్మెల్యే లను అసెంబ్లీ నుండి బహిష్కరించాలని అన్నారు.

నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని బెంగళూరు పోలీసులు తెలిపారని, టీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు ల్యాండ్, శాండ్ , వైన్ డీల్ చేసే నేతలు.. ఇప్పుడు డ్రగ్స్ దందా లో కూడా వేలు పెట్టారని అన్నారు. కర్ణాటకలో బీజేపీ తో మాట్లాడి కేసును మాఫీ చేసుకున్నారని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య అండర్ స్టాండింగ్ ఉందని సాగర్ లో టీ.ఆర్.ఎస్ కు లబ్ది చేకూర్చడం కోసం బీజేపీ బలహీనమైన వ్యక్తి ని పెట్టిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news