కరోనా ఔషధం పై రెడ్డీస్ కీలక ప్రకటన

-

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కరోనా ఔషధంపై కీలక ప్రకటన చేసింది. డీఆర్డీవో – డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ రూపొందించిన 2 – డీజీ ఔషధం అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది అని తెలిపింది.ఆస్పత్రిపాలైన మోడరేట్, సీరియస్ కేసుల్లో వైద్యుల సూచన మేరకు అదనపు ఔషధంగా మాత్రమే దీన్ని వినియోగించాలి అని సూచించారు. మార్కెట్లోకి ఈ ఔషధాన్ని విడుదల చేయలేదు అని వివరించింది.

ఒక్కో ప్యాకెట్ ధర ఎంత అన్నది కూడా నిర్ణయించలేదు అని తెలిపింది. జూన్ మధ్యలో కమర్షియల్ లాంచ్ చేస్తాం అని వివరించింది. అందరికీ అందుబాటులో ఉండేలా ధర నిర్ణయిస్తాం అని పేర్కొంది. 2 – డీజీ పేరుతో విక్రయించే నకిలీ ఔషధంపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. వాట్సాప్ సహా సోషల్ మీడియాలో 2 – డీజీ ఔషధం గురించి వచ్చే పోస్టులను విశ్వసించవద్దు అని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news