WTC Final: టీం ఇండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ

-

న్యూజిలాండ్ తో ప్రతిష్టాత్మక టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కోసం టీమిండియా సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 18 నుంచి సౌతాంష్టన్ వేదికగా టీమిండియా మరియు న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ ఫైనల్ కోసం… కొద్దిసేపటి క్రితమే భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో తుది జాబితాను విడుదల చేసింది బిసిసిఐ.


కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్యా రహనేతో పాటు ఓపెనర్లుగా రోహిత్, శుబ్ మన్ గిల్ ను ఫైనల్ చేసింది బీసీసీఐ. అలాగే వికెట్-కీపర్లుగా రిషబ్ పంత్ మరియు వృద్ధిమాన్ సాహాను ఎంపిక చేసింది బిసిసిఐ.
జట్టు వివరాలు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ క్యాప్టెన్,) రోహిత్, శుబ్ మన్ గిల్, పూజర, హనుమ విహారి, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, సమీ, ఉమేష్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Latest news