ఆ నేత‌కు స‌పోర్టుగా ర‌ఘురామ‌.. ఇదేం ట్విస్టు!

-

ఏపీలో ప్ర‌స్తుతం వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ పాలిటిక్స్ ఎవ‌రికీ అర్థం కాకుండా ఉన్నాయి. ఇప్ప‌టికే ఆయ‌న వైసీపీపై కేంద్ర పెద్ద‌ల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతున్నారంటూ ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. కాక‌పోతే ఆయ‌న దాన్ని డిక్లేర్ చేయ‌ట్లేదు. ఇకపోతే వైసీపీపై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు కూడా ఆప‌ట్లేదు. దీనికి త‌గ్గ‌ట్టు వైసీపీ కూడా షాక్ ఇస్తోంది ఈ రెబ‌ల్ ఎంపీకి.

ysrcp mp raghurama krishnamraju to respond on notices issued by party

కాగా ఆయ‌న ఆయ‌న అనూహ్యంగా ఓ టీడీపీ నేత‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. రీసెంట్‌గా విజయనగరం రాజకుటుంబం నుంచి వ‌చ్చిన టీడీపీ ముఖ్య నేత అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొన్ని ఆరోపణలు చేసిన విష‌యం అంద‌రికీ విదితమే. కాగా ఆయ‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఎంపీ ర‌ఘురామ స్పందించారు.

విజ‌య‌సాయి చేస్తున్న ఆరోపణల్లో ప‌స లేద‌ని, అవ‌న్నీ నిరాధారమైన ఆరోపణలని ర‌ఘురామ ఏకంగా సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌ల వల్ల వైసీపీ ప్రతిష్ఠ దెబ్బతింటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఇక్క‌డ రఘురామ అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు స‌పోర్టుగా ఉంటున్నాడా లేక పార్టీకి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారా లేక టీడీపీకి మ‌ద్ద‌తిస్తున్నారా అనేది అర్థం కాకుండా ఉంది. ఏదేమైనా ర‌ఘురామ పాలిటిక్స్ చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news