ప్రయాణికులకు గుడ్ న్యూస్ : పరుగులు పెట్టనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

-

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే మంత్రిత్వ శాఖ.  కరోనా మహమ్మారి ప్రబలిన కారణంగా నిలిపివేయబడిన హైదరాబాద్ మహానగరంలోని ఎంఎంటీఎస్ రైలు సేవలు వచ్చే వారంలో పునఃప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఎంఎంటీఎస్ సేవలు హైదరాబాద్ మహానగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న దిగువ, మధ్యతరగతి ప్రజలకు, చిరు వ్యాపారులకు, విద్యార్థులకు, ప్రైవేట్ ఉద్యోగులకు ఇంకా వివిధ రంగాల వారికి గత కొన్ని ఏళ్లుగా అత్యంత చవకైన సురక్షితమైన రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

అయితే కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం మొదట్లో నిలిపివేయబడిన సేవలు, ముఖ్యంగా దిగువ, మధ్య తరగతి వర్గాలవారిని దృష్టిలో పెట్టుకొని కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ ప్రజల సౌకర్యార్థం పునః ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరంలో ఎంఎంటీఎస్ సేవలు పునః ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా నియమ నిబంధనల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఎంఎంటీఎస్ సేవలను ఉపయోగించు కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news