కౌశిక్ రెడ్డిని శ్రీరెడ్డితో పోలుస్తూ కాంగ్రెస్ నేత ఫైర్

-

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి‌ని మొమైత్ ఖాన్‌తో పోల్చారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డిని శ్రీరెడ్డితో పోల్చుతూ ఆయన కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ స్క్రిప్టు చదివే కౌశిక్ రెడ్డికి సిగ్గు ఉండాలని వ్యాఖ్యానించారు.

కౌశిక్ రెడ్డి, ఆయన అన్న కోట్లాది రూపాయాలు తీసుకొని జీహెచ్ఎంసీ, జనరల్ ఎలక్షన్లలో టికెట్లు అమ్ముకున్నారని కృష్ణారెడ్డి ఆరోపించారు. వైఎస్ టీకెట్ ఇస్తానన్నప్పుడు కౌశిక్ రెడ్డి చెడ్డీలు కూడా వేసుకోలేదని గుర్తు చేశారు. అత్తాపూర్ సమీపంలోని పెట్రోల్ బంక్, తిరుమల నగర్ పెట్రోల్ బంక్ రెండింటినీ కౌశిక్ లీజు తీసుకున్నారని తెలిపారు 25 ఏళ్ల లీజు అగ్రిమెంట్ అయిపోవడంతో ఆ రెండు పెట్రోల్ బంకులు మూత పడ్డాయని చెప్పారు. అత్తాపూర్ పెట్రోల్ బంక్ ఉన్న ప్రభుత్వ స్థలం 25 గుంటలను కబ్జా చేసి కుక్కల ఫామ్ పెట్టారన్నారు. నియోజక వర్గంలో కౌశిక్ రెడ్డికి కుక్కల ఫామ్, ఆయన అన్నకు కోళ్ల ఫామ్ ఉన్నాయని కృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news