చంద్రబాబు టూర్‌లో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ జెండాలు.. నెక్ట్స్ సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు

-

కృష్ణా: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ జెండాలు దర్శనమిచ్చాయి. మచిలీపట్నం, బందరులో ఇవాళ చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే మచిలీపట్నంకు చేరుకున్న చంద్రబాబుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు. చంద్రబాబు కాన్వాయ్ ఎదుట జూనియర్ ఎన్టీఆర్ జెండాలు ప్రదర్శించారు. నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.

అయితే చంద్రబాబు మాత్రం ప్రతిఒక్కరికి నమస్కరిస్తూ పార్టీ గుర్తుగా రెండు వేళ్లు చూపిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇటీవల కాలంలో చంద్రబాబు సొంత జిల్లాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ జెండాలు దర్శనమిచ్చాయి. ఈ రెండు ఘటనలతో టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ క్రీయాశీలకంగా పని చేయాలని అభిమానులు కోరుకుంటున్నట్లు అర్ధమవుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతానికి సినిమాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. అయినా టీడీపీ అధినేత పర్యటనల్లో అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ జెండాలు చూపిస్తున్నారు. ఈ పరిణామం టీడీపీలో కొంత అలజడి రేపుతోందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news