మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ సర్కార్

-

లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించింది ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు గుంటూరు జిల్లా తాటికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి. ఆమె భర్త తో కలిసి వచ్చిన… తాటికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా పూర్ణకుంభం తో లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ స్వాగతం పలికింది. అయితే.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలను ఏపీ ప్రభుత్వం సమర్పించడం ఇది కొత్తేమీ కాదు. ఈ పద్దతి చాలా రోజుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించింది. ఇక అటు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇవాళ ఉదయమే.. అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news