భూమా అఖిల సంచలన ఆరోపణలు : ఏపీలో ఎర్రమట్టి దందా !

-

కర్నూలు : తెలుగు దేశం మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని…ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గు చేటని ఆమె నిప్పులు చెరిగారు. ఆళ్లగడ్డ మండలం ఆర్ క్రిష్ణాపురంలో వైసీపీ నేతలు ఎర్రమట్టి దందా సాగిస్తున్నారని ఆమె మండిపడ్డారు. పుల్లయ్య అనే వ్యక్తి పేరు మీద ఎకరాకు పర్మిషన్ తీసుకొని…. మరికొన్ని ఎకరాల్లో ఎర్రమట్టి తవ్వుతున్నారని ఆరోపించారు.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చెరువులను వైసీపీ నాయకులు కబ్జా చేసి మట్టి తవ్వకాలు జరిపి అమ్ముకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. మట్టి మాఫియా నుంచి స్థానిక ఎమ్మెల్యేకు వాటాలు వస్తున్నాయని ఆరోపించారు. అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న వాహనాలను పట్టుకొని అధికారులకు అప్పగిస్తే సీజ్ చేశారు….కానీ ఉదయం ఆ వాహనాలు వైసీపీ నాయకుడి ఇంట్లో ఉన్నాయన్నారు. వారంలో అధికారులు ఎర్రమట్టి దాందాను అరికట్టాలని.. లేకపోతే రైతులతో కేసులు పెట్టిస్తామని భూమా అఖిల ప్రియ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news