బిగ్ బ్రేకింగ్ : సెప్టెంబర్ 15 నుండి ఇంటర్ పరీక్షలు.. ?

-

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా సెప్టెంబర్ 15 నుండి పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

కరోనా విజృంభణతో పరీక్షలు లేకుండానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రమోట్ అయిన ప్రతి సెకండియర్ విద్యార్థి మళ్లీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయాల్సిందే అని విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దయినా ఫస్ట్ ఇయర్ మార్కులు ఆధారంగా పాస్ చేయవచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news