చంద్రబాబు, కెసిఆర్ ఇద్దరూ కాంగ్రెస్ నేతలే : రేవంత్

-

రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, కెసిఆర్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళేనని.. వైఎస్ఆర్, చంద్రబాబు, కెసిఆర్ లాంటి నాయకులను కూడా యూత్ కాంగ్రెస్ అందించిందని అసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

యూత్ కాంగ్రెస్ వాళ్ళు టికెట్ల అడిగే ముందు… ప్రజల కోసం ప్రభుత్వం మీద ఏం కొట్లాడినరో చూస్తామని..టికెట్ తీసుకుని జనం లోకి పోతా అంటే… ఓడిపోతారని పేర్కొన్నారు. పోటీ చేసి ఓడిపోతే బాల్య వితంతులుగా మారిపోతారని తెలిపారు రేవంత్. రేవంత్ పార్టీ మారలేదా అంటున్నారని.. రేవంత్ పార్టీ మారింది… ప్రతిపక్షం లో చేరి కొట్లాడడానికి అని తెలిపారు. కానీ అధికార పార్టీ లోకి…అధికారం కోసం పోలేదని చురకలు అంటించారు. చేతికి మట్టి అంటకుండా యూత్ కాంగ్రెస్ నాయకున్ని అంటే ఎవరు పట్టించుకోరన్నారు. శివసేన రెడ్డీ కాలు చిప్ప పగల గొట్టుకుంటే… రాహుల్ గాంధీ పక్కన కూర్చున్నాడని.. పని చేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news