టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ : రేపు విచారణకు పూరి జగన్నాథ్ !

-

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది ఈడీ. ఈ కేసులో రేపటి నుంచి విచారణ చేపట్టినుంది ఈడి. ఇక ఇప్పటికే ముగ్గురు నిందితులు దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడి.. ముగ్గురు ఇచ్చిన సమాచారంతో 12 మంది టాలీవుడ్ నటీనటులకు నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ నటీనటుల విచారణ తరువాత మరికొందరి పై దృష్టి పెట్టిన ఈడి.. ఎక్సైజ్ శాఖ విచారించిన వారందరికీ నోటీసులు పంపే యోచనలో ఉంది..

డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అధికారులు విచారించిన 50 మందికి ఈడి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.. మొత్తం 62 మంది ని విచారించాలని ప్లాన్ చేసిన ఈడి.. రేపు టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాధ్ ను విచారణ చేయనుంది.

ఇక డ్రగ్స్ కేసు లో హవాలా మనీ లాండరింగ్ ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు గా గుర్తించిన ఈడి.. డ్రగ్స్ కొరకు పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులను మళ్లీంచ్చినట్లుగా గుర్తించింది. డ్రగ్స్ కొనుగోలు చేసి నిందితులకు హవాలా ద్వారా డబ్బులు తరలించారని గుర్తించింది ఈడీ. ఇక ఈ కేసు లో ఎందరు బయటపడనున్నారో.. త్వరలోనే తెలనుంది.

Read more RELATED
Recommended to you

Latest news