డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్ : ఈడి విచారణకు రకుల్ దూరం !

-

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో ఈడి విచారణకు రకుల్ ప్రీత్ సింగ్ దూరం అయ్యేలా కనిపిస్తోంది. డ్రగ్స్ కేసు లో రకుల్ ప్రీత్ సింగ్ హాజరు పై సందిగ్తాత నెలకొంది. ఈడి జారీ చేసిన నోటీసులు ప్రకారం సెప్టెంబర్ 6 న విచారణ కు రకుల్ ప్రీత్ సింగ్ హాజరు కావాలి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈడి విచారణ కు హాజరు కాలేనంటు ఈడి అధికారులను కోరింది రకుల్ ప్రీత్ సింగ్.

ఈడి విచారణ కు తాను హాజరు అయ్యేందుకు మరో డేట్ ఇవ్వాలని ఈడి అధికారులను కోరింది రకుల్ ప్రీత్ సింగ్. అటు ఎక్సైజ్ అధికారుల విచారణ లో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేకున్నా.. డ్రగ్స్ కేసు తో పలు లింక్ లు ఉన్న నేపథ్యం లో రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు జారీ చేసింది ఈడి. అయితే రకుల్ ప్రీత్ సింగ్ విజ్ఞప్తి పై ఈడి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా ఇవాళ డ్రగ్స్ కేసులో నటి ఛార్మి విచారణకు హాజరు అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news