వైరల్ : నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్త ఉండండి.. లేదంటే ?

-

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల లో గణపతి పండగ హడావిడి మొదలైన సంగతి తెలిసిందే. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా… గణపతి ఉత్సవాలకు కాస్త ఆటంకం ఏర్పడింది. అయితే ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడంతో…. గణేష్ ఉత్సవాలను చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు ప్రజలు. డిజె సౌండ్ లు, భజనలతో గణపతి మండపాలు హోరెత్తుతున్నాయి. ఇక అటు…. గణపతులను నిమజ్జనం చేసేటప్పుడు రూల్స్ పాటించాలి అంటూ హెచ్చరిస్తున్నారు.

Lord Ganesha , Ganesh Festival

వినాయకుడి నిమజ్జనం పేరుతో… ప్రకృతి ని నాశనం చేయకూడదని కోర్టులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మట్టి వినాయకుల…. సంఖ్య పెరిగింది. ఇక ఇదిలా ఉండగా…  ఇంకా కొందరు భక్తులు… గణపతి విగ్రహాలను నిమజ్జనం చేస్తూనే ఉన్నారు. ఈసారి భారీ వర్షాలు పడడంతో చెరువులు కుంటలు అన్ని పూర్తిగా నిండాయి. ఈ నేపథ్యంలోనే కొందరు ఉత్సాహంతో చెరువులో దగ్గరకు వెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. అయితే ఇలాగే ఓ వ్యక్తి.. స్థానిక చెరువు దగ్గరికి వెళ్లి నిమజ్జనం చేస్తుండగా… బొక్క బోర్లా పడ్డాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. దేవుని కోసం వెళితే ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు. కాబట్టి నిమజ్జనం సమయంలో ఆడబిడ్డ లేకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news