హాకీ ఇండియా సంచలన నిర్ణయం.. 2022 కామన్ వెల్త్ క్రీడల నుంచి విత్ డ్రా

-

హకీ ఇండయా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక కామన్ వెల్త్ క్రీడల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించింది. 2022లో ఇంగ్లండ్ లో జరిగే కామన్ వెల్త్ గేమ్స్ కు నుంచి వైదొలుగున్నట్లు తెలిపింది. వచ్చేే ఏడాది ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ నగరం కామన్ వెల్త్ గేమ్స్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇంగ్లాండ్ లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కఠినమైన కరోనా క్వారంటైన్ నిబంధనల కారణంగా కూడా హాకీ ఇండియా పర్యటనను రద్ధు చేసుకున్నారు.

ఇండియా నుంచి యూకే వెళ్లే వారు అక్కడ తప్పకుండా 10 రోజులు కఠిన క్వారంటైన్ లో ఉండాల్సిందే.  ఇప్పడు ఆ నిబంధనే కామన్వెల్త్ టూర్ కు ప్రతిబంధకంగా మారాయి. మరోవైపు ఇదే కారణం చెబుతూ భువనేశ్వర్లో జరుగుతున్న పురుషుల జూనియర్ వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ తమ జట్టును పంపించలేదు. ఈ నిర్ణయం వెలవడిన రోజు తర్వాత హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news