నేడే ఈటల రాజేందర్ నామినేషన్

-

కరీంనగర్ జిల్లా : హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం తుది ఘట్టానికి చేరింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ఘట్టం నేటి తో ముగయనుంది. దీంతో నేడు బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బీజీపీ పార్టీ ఈటెల రాజేందర్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు హుజూరాబాద్ కు రానున్నారు.

అటు మధ్యాహ్నం 12 గంటలకు హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు బలమూరి వెంకట్. దీంతో హైదరాబాద్ నుంచి హుజురాబాద్ కు బయలుదేరారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. వెంకట్ నామినేషన్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇక నిన్న ఒక్కరోజే 11 నామినేషన్లు దాఖలు కాగా…  ఇప్పటివరకూ మొత్తం 24 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ నెల11 న నామినేషన్లు పరిశీలన ఉండనుండగా.., 13 న నామినేషన్ల ఉపసహరణ ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news