రావణ రాజ్యం పోవాలి.. రాముడి రాజ్యం రావాలి : విజయశాంతి

-

రావణ రాజ్యం పోవాలి రాముడి రాజ్యం రావాలని.. ఈటల రాజేందర్ ను అత్యాధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు సినీనటి బిజెపి నాయకురాలు విజయ శాంతి. హుజురాబాద్ పట్టణంలో రోడ్ షో లో పాల్గొన్నారు విజయ శాంతి. ఈ సందర్భంగా విజయ శాంతి మాట్లాడుతూ.. బీజేపీ ప్రచారం కంటే ప్రజల బీజేపీ ప్రచారం ఎక్కువయిందని.. ప్రజలు బీజేపీ పార్టీ ప్రచారాన్ని భుజాన వేసుకున్నారన్నారు.

ఈటల ఆరు సార్లు గెలిచాడంటే ప్రజల మద్దతు ఎలా ఉందో అర్ధమవుతుందని.. కేసీఆర్ చేస్తున్న తప్పులకు ఈ రోజు హుజురాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కారులను అవహేళన చేసాడు, తడిగుడ్డతో గొంతుకోశాడని మండిపడ్డారు.

దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మోసం అక్కడి నుండే మొదలైందని.. ప్రపంచాన్ని కుదిపేసిన కరోన కాలంలో ఈటెల రాజేందర్ తన డ్యూటీ తను చేసాడని కొనియాడారు. కరోనా కాలంలో ప్రాణ తీపితో బయటకు రాని ముఖ్యమంత్రి కెసిఆర్ అని.. ఏడేళ్లు గా మంత్రి పదవిలో ఉన్న ఈటెలను ఏడూ నిమిషాల్లో తీసేసావంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ద్రోహులను దగ్గర పెట్టుకున్నాడని.. ఉద్యమ కారులను నడిరోడ్డు పై వదలేశాడని కెసిఆర్ పై మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉద్యమకారులకు తోడుగా ఉండేది బీజేపీ పార్టీ అని.. కెసిఆర్ ను గద్దె దింపే వరకు పోరాడుతామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news