ఆ నలుగురు ..వివేకా హత్య కేసులో వీడిన మిస్టరీ !

-

వివేకా హత్య కేసులో నిందుడుతు దస్తగిరి కన్పెషన్ స్టేట్ మెంట్ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే అప్రువల్ గా మారిన డ్రైవర్ దస్తగిరి… వివేకా హత్యకు ఎర్రగంగిరెడ్డి స్కెచ్ గీసినట్లు తన కన్పెషన్ స్టేట్ మెంట్ లో తెలిపారు. రూ. 40 కోట్లతో డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఎర్రగంగిరెడ్డి , సునీల్ కుమార్ యాదవ్ , ఉమాశంకర్ తో కలిసి వివేకాను హత్య చేసినట్లు తెలిపారు దస్తగిరి. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్ రెడ్డితో కలిసి మర్డర్ చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. ఎర్రగంగిరెడ్డి హత్యకు ప్లాన్ చేసినట్లు కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంగిరెడ్డి మోసం చేశారు.. మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాశ్ లకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్టు కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో దస్తగిరి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని… నన్ను కావాలనే ఓడించారు.. మీ కథ తేలుస్తానంటూ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్ రెడ్డిలకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్లు డ్రైవర్ దస్తగిరి చెప్పారు. తర్వాత కొన్ని రోజులపాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డిల మధ్య మాటలు బంద్ అయ్యాయన్నారు. కోటి రూపాయలు ఇస్తాం.. వివేకాను హత్య చేయాలని గంగిరెడ్డి ఆఫర్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో దస్తగిరి వెల్లడించారు.

నువ్వొక్కడివే కాదు, మేమూ వస్తాం కలిసి వివేకాను చంపేద్దామంటూ గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి స్టేట్ మెంట్ ఇచ్చారు. దీని వెనుక అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి ఉన్నారని చెప్పాడు ఎర్ర గంగిరెడ్డి. మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారని… తనకు 5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి ఇచ్చిన అడ్వాన్స్ లో 25 లక్షలు సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని చెప్పాడు దస్తగిరి. సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర కుక్కను కారుతో తొక్కించి చంపేసినట్లు దస్తగిరి వెల్లడించారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలతో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్ లోకి దూకి లోపలికి వెళ్లినట్లు దస్తగిరి తెలిపారు.

అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్లు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తనను చూసిన వివేకా ఈ సమయంలో వీళ్ళెందుకు వచ్చారని నిర్ఘాంతపోయారని, తర్వాత వివేకా బెడ్ రూమ్ లోకి వెళ్లడంతో అతని వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లాడని దస్తగిరి స్టేట్ మెంట్ ఇచ్చాడు. వివేకా బెడ్ రూమ్ లో డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం జరిగిందని… వివేకాను బూతులు తిడుతూ మొహంపై సునీల్ యాదవ్ దాడి చేసినట్టు వెల్లడించారు. తన చేతిలోని గొడ్డలితో సునీల్ యాదవ్ వివేకాపై దాడి చేశాడన్నారు దస్తగిరి. వెంటనే వివేకా కింద పడిపోవడంతో అతని ఛాతీపై 7,8 సార్లు సునీల్ యాదవ్ బలంగా కొట్టినట్టు దస్తగిరి వెల్లడంచారు.

Read more RELATED
Recommended to you

Latest news