కుప్పంలో.. చంద్రబాబు కోట బద్దలైంది : సజ్జల

-

కుప్పంలో కూడా టీడీపీ క్లోజ్ కానుందని.. అందుకే తోక తెగిన బల్లిలా గిలగిలా కొట్టుకుంటున్నారని చురకలు అంటించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. కుప్పం మొత్తం ఓటర్లు సుమారుగా 37 వేలు ఉన్నాయని మొదటి సారి మున్సిపాలిటీ అయిన కుప్పం ఎన్నికల గురించి చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే బాధేసిందన్నారు.

ఇటువంటి వ్యక్తిని రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఎలా భరించింది అనిపించిందని ఎద్దేవా చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఒకే తాను ముక్కలని.. ఈ మూడు పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు కుప్పాన్ని చెరబట్టారని.. ఆయన చెరలో కుప్పం దశాబ్దాలుగా నలిగిపోయిందన్నారు.

ఇన్నాళ్లు మకుటం లేని మహారాజులా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు వెలిగారని.. ఇప్పుడు ఆ కోట బద్దలయ్యిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ప్రభావాన్ని కుప్పం ప్రజలు చూస్తున్నారని.. దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. అందుకే ఎంతో ధైర్యంతో ముఖ్యమంత్రి ప్రత్యేక చట్టమే తీసుకుని వచ్చారని తెలిపారు. రౌడీ షీట్ ఉన్న నలుగురిని చంద్రబాబు ఏజెంట్లుగా పెట్టారని.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే టీడీపీ నాయకులు ఆ స్థాయిలో రోడ్ల మీదకు రాగలుగుతారా? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news