సెల్ ఫోన్, బైక్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య…!

-

చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మనదేశంలో ఆత్మహత్య లు చేసుకుంటున్న వారి సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం యువతే ఉండటం మరో ఆందోళన కలిగించే విషయం. ఇక యువత ఎక్కువగా బైకులు, సెల్ ఫోన్ లు కోనివ్వలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ లో ఓ బాలుడు సెల్ ఫోన్, బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే….వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..కరీంనగర్ సిక్ వాడికి చెందిన బాలుడు (16) ఇంటర్ చదువుతున్నాడు. తన తల్లి తండ్రులను బైక్ మరియు సెల్ ఫోన్ కొనివ్వాలని కొద్ది రోజులుగా మారాం చేస్తున్నాడు. కాగా వాళ్ళు ఇప్పుడే బైక్ నడిపే వయసు లేదని చెప్పి కొనివ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news