కేరళ వరద బాధితుల కోసం కేఎంసీ కన్ స్ట్రక్షన్స్ అధినేత, వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. వ్యక్తిగతంగా, తన సంస్థ తరుఫున ఈ విరాళాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి ని కలిసి ఈ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించనున్నట్లు వివరించారు. ఈ నెల 28,29 తేదీల్లో కేరళ వెళ్తానన్నారు. వరద బాధితుల పునరావాసం, ఇతర సేవా కార్యక్రమాల కోసం ఈ డబ్బుని వినియోగించాలని కోరనున్నారు. అయితే కేరళ వరద బాధితులకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భారీ విరాళాల్లో ఇది ఒకటి. మొత్తాన్ని చెక్ రూపంలో అందజేయనున్నట్లు తెలిపారు. ఈయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కేరళకు కోటి విరాళం ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్యే
-
Previous article
Read more RELATEDRecommended to you
నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తిరుపతిలో భారీ వర్షం..!
దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా...
Anji N -
సిక్కిం సీఎం గా తమంగ్.. జూన్ 09న ప్రమాణ స్వీకారోత్సవం..!
సిక్కిం క్రాంతికారీ మోర్చా అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ జూన్ 9న...
Anji N -
ఏపీ అసెంబ్లీ రద్దు.. గవర్నర్ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 15వ ముఖ్యమంత్రిగా కొనసాగారు జగన్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో...
Anji N -