ఏపీ అసెంబ్లీ రద్దు.. గవర్నర్ నోటిఫికేషన్

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 15వ ముఖ్యమంత్రిగా కొనసాగారు జగన్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులు 135, 21, 08 స్థానాలను దక్కించుకోవడంతో వైసీపీ కి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో నిన్న సీఎం పదవీకి జగన్ రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు.

ముఖ్యమంత్రి రాజీనామా చేయడంతో తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దు అయింది. 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేసారు గవర్నర్ అబ్దుల్ నజీర్. ఈనెల 09న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు చంద్రబాబు. ఇప్పటికే ప్రధాని మోడీని భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news