BREAKING : వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్..

-

అమరావతి : మాజీ టిడిపి నేత వంగవీటి రాధాకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. వంగవీటి రాధాపై రెక్కి నిర్వహించిన వ్యవహారంపై ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. గన్ మెన్లను తిరస్కరించడం సరి కాదన్న చంద్రబాబు నాయుడు… తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకు సూచించనలు చేశారు.

భధ్రత విషయంలో అశ్రద్ద వద్దన్న చంద్రబాబు… రాధాకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని తెలిపారు. కుట్ర రాజకీయాలపై పార్టీ పరంగా పోరాడదామన్నారు చంద్రబాబు. కాగా త‌న‌ను చంప‌డానికి చూస్తున్నారని.. వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగ వ‌ర్ధంతి సంద‌ర్బంగా నిర్వ‌హించిన ఆత్మీయ స‌భ‌లో వంగవీటి రాధా మాట్లాడారు.

త‌న‌ను చంపడానికి కొంత మంది రెక్కీ నిర్వహించారని… రంగా కీర్తి ,ఆశయాల సాధనే తప్ప లక్ష్యం, పదవుల పై త‌న‌కు అస్స‌లు ఆశ లేదని స్ప‌ష్టం చేశారు వంగవీటి రాధా. కానీ త‌న‌ను ఏదో చేద్దాము అనుకుని కొంత మంది గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రెక్కీ నిర్వహించార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news