దొడ్డిదారిన సీఎం అయ్యావు…శివరాజ్ సింగ్ చౌహన్ పై తలసాని ఫైర్‌

-

దొడ్డిదారిన సీఎం అయ్యారని.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్‌ అయ్యారు. అక్కడ ఉన్న ప్రభుత్వంను పడగొట్టి,ఎమ్మెల్యేలను కొని శివరాజ్ సింగ్ చౌహన్ సీఎం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో …తెలంగాణ లో అభివృద్ధి పై చర్చకు సిద్ధమా ? అని సవాల్‌ విసిరారు. దేవుళ్లను మీరే మొక్కుతారా ? మీరే భక్తులా ? అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా బిజెపి నేతలు డ్రామాలు చేస్తున్నారని… పీఎం మోడీని పంజాబ్
రైతులు అడ్డుకున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్

మోడీ లాగా ఈ దేశంలో ఎవరైనా డ్రామా చేయగలరా ? రైతులు ఎందుకు అపారో మోడీ ఆలోచన చేసుకోవాలని చురకలు అంటించారు. నాలుగు సార్లు సీఎం అయిన చౌహన్…ఇంకో సీఎం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని… నాలుగు సార్లు సీఎం అయి చౌహన్ ఆ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు ? అని నిలదీశారు. రాష్ట్రాల అభివృద్ధి గురించి చౌహన్ మాట్లాడితే బాగుండేదని.. శివరాజ్ చౌహన్ కు ఏమైనా మతి భ్రమించిందా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సార్లు సీఎం అయిన తెలంగాణ రాష్ట్రంలా మధ్య ప్రదేశ్ ను శివరాజ్ సింగ్ చౌహన్ అభివృద్ధి చేయలేరని చురకలు అంటించారు. మాకు తిక్కలేస్తే మేము కూడా మధ్యప్రదేశ్ వచ్చి మాట్లాడతామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news