తెలంగాణలో తారకరామారావు రాజ్యం రావాలి : మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో తారకరామారావు రాజ్యం రావాలని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 310 కోట్లతో అభివృద్ధి పనులకు మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్, పీర్జాదిగుడా, జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్లలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేషన్లలోని కార్పొరేటర్లు అగ్గి పిడుగులు. వరదల సమయంలో అహర్నిశలు పని చేశారని కొనియాడారు.

మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని చెరువుల సుందరీకరణ కోసం నిధులు విడుదల చేయాలన్నారు. సాయిప్రియా కాలనీ వాసులకు అన్యాయం జరిగింది. పేద ప్రజలకు నష్టం చేసిన బిల్డర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి జైల్లో వేయాలని ఫైర్ అయ్యారు. వరాలు ఇచ్చే దేవుడు రామారావు..తారకరామారావు రాజ్యం రావాలని ఉందని కోరారు. బీజేపీ ప్రభుత్వం దగుల్బాజీ ప్రభుత్వమని.. బీజేపీ నేతలను తరిమి తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. బడ్జెట్ లో ఒక్క రూపాయి తెలంగాణ రాష్టానికి ఇవ్వలేదని.. బీజేపీ ఎంపీలను ఎక్కడికక్కడ నిలదీయాలని కోరారు. దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ అని కొనియాడారు.

 

Read more RELATED
Recommended to you

Latest news