బంగాళాఖాతంలో దూకి ఆత్మహత్య చేసుకో : ప్రధాని పై రేవంత్ సంచలనం

-

ప్రధాని మోడి పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు లో ప్రధాని ప్రసంగం, అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆథమ స్థాయిలో మాట్లాడినట్లుగా ఉంది..చట్టంలో లేకపోయినా, నమ్మకం కలిగించేలా ప్రధానులు వాఖ్యలు ఉండేవని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపుతో ప్రధాని మాట్లాడారని.. మోడీ మేనేజ్మెంట్ ద్వారా పీఎం అయ్యారని నిప్పులు చెరిగారు.

గురువయిన అద్వానీని మోసం చేసిన ఘనత మోడీ దని.. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అంటూ 1997 లో కాకినాడలో తీర్మానం చేసింది బిజెపి అని గుర్తు చేశారు. తెలంగాణ జాతిని ప్రధాని అవమానించారు. .ప్రధానికి చదువు సంధ్య లేదు.. మోడీ ప్రధాని అవటం దురదృష్టకరమని చురకలు అంటించారు. ఆంద్రప్రదేశ్ ప్రజలను సైతం మోడీ వంచించాడు..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. బంగాళాఖాతంలో దూకి ప్రధాని ఆత్మహత్య చేసుకోవాలని ఫైర్ అయ్యారు.

తెలంగాణా కోసం పదవి త్యాగం చేయకుండా, మోడీ వెనుక దాక్కున్నాడు..కిషన్ రెడ్డి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. మోడీ తెలంగాణ ద్రోహి, వ్యతిరేకి అని నిరూపించుకున్నాడు..మోడీ మాట్లాడుతుంటే టీఆరెస్ ఎంపీలు నోరెత్తటం లేదని విమర్శించారు. మోడీ ప్రసంగాన్ని కాంగ్రెస్ ఖండిస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news