సీఎం జగన్ తో పేర్ని నాని భేటీ.. సినిమా టికెట్ల ధరలపై కీలక ప్రకటన !

-

తాడేపల్లి : సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో ఏపీ సినిమటోగ్రఫి మంత్రి పేర్నినాని భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి సీఎం జగన్ మోహన్ రెడ్డి తో.. క్యాంపు కార్యాలయంలో సీఎం ను కలిసారు మంత్రి పేర్ని నాని. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై సీఎం తో చర్చించారు మంత్రి పేర్నినాని. సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం నియమించిన కమిటీ చేసిన అద్యయనం పై ఇద్దరు చర్చించారు.

ఇక ఈ నెల 10న సీఎం జగన్ తో చిరంజీవి సహా ఇతర సినిమా పెద్దల సమావేశం జరుగనుంది. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై దాదాపు సిద్దమైన కమిటీ నివేదిక కూడా తయారు అయింది. ఈ నేపథ్యంలోనే సినిమా టికెట్ల కనీస ధర , గరిష్ట ధరలు ఎంత ఉండాలనే అంశంపై మంత్రి పేర్నినాని , సిఎం జగన్ మోహన్ రెడ్డి తో చర్చ నిర్వహించారు. సినిమా ప్రముఖులతో భేటీలో వారి అభిప్రాయాలు తీసుకుని చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. సినిమా ధియేటర్ల యజమానుల సమస్య పరిష్కారంపైనా చర్చ నిర్వహించ నున్నారు జగన్ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news