షాద్ నగర్ పరిధిలోని ఇన్ముల్ నర్వ గ్రామ ప్రాథమిక పాఠశాలలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలోని చెత్తను దగ్ధం చేసిన క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ముజాహిద్ అనే ఒకటవ తరగతి విద్యార్థి మంటల్లో తీవ్ర గాయాల పాలయ్యాడు. మంట పెట్టిన సమయంలో అటెండర్లు, స్వీపర్లు ఎవరూ లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుణ్ణి స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Ranga Reddy: చెత్త మంటల్లో బాలుడు
By Network
-
Previous article
Next article