పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. తప్పనిసరిగా ఈ అప్డేట్ చెయ్యాల్సిందే..!

-

కేంద్రం ఎన్నో స్కీమ్స్ ని అందిస్తోంది. అయితే వాటిలో ప్రత్యేకంగా రైతుల కోసం కొన్ని స్కీమ్స్ ని అందిస్తోంది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఒకటి. పీఎం కిసాన్ స్కీమ్‌కు సంబంధించిన నియమనిబంధనలు తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

farmers

అప్డేట్స్ ని తెలుసుకుని తగినట్టుగా అనుసరించకపోతే డబ్బులు తీసుకోవడం అవ్వదు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పీఎం కిసాన్ స్కీమ్‌లో రిజిస్టర్ అయిన రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ చేయించాలి. ఇ-కేవైసీ చేయించక పోతే వారి అకౌంట్‌లోకి స్కీమ్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చే అవకాశం ఉండదు.

కనుక రైతులు తప్పకుండ ఇ-కేవైసీ ద్వారా వివరాలన్నీ అప్‌డేట్ చేయించాలి. ఆధార్ బేస్డ్ ఇ-కేవైసీ చేయించాలంటే ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేయాలి. ఆధార్ నెంబర్‌కు ఏ మొబైల్ నెంబర్ లింక్ ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం.

  • ఇ-కేవైసీ చేయించాలంటే ముందుగా పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్
  • https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.
  • నెక్స్ట్ మీకు హోమ్ పేజీలో eKYC ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తరవాత మీరు ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
  • మీ ఆధార్ కార్డుకు లింకైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత Get OTP ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తరవాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.
  • అంతే ఇ-కేవైసీ సబ్మిట్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news