దేశంలో గోల్ మాల్ గోవిందంగాళ్లు మోపు అయ్యారు. : సీఎం కేసీఆర్

-

దేశంలో ఈ మధ్య గోల్ మాల్ గోవిందంగాళ్లు మోపయ్యారని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రజలకు కుల పిచ్చి, మత పిచ్చి లేపి దుర్మార్గమైన చర్యలు చేసేలా చేస్తున్నారు. దేశాన్ని ఆగం పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దుర్మార్గమైన పద్దతిలో రాజకీయాలను మంట కలిపే ప్రయత్నం చేస్తున్నారు. కులం, మతం జాతి లేకుండా.. ప్రజలంతా బాగు పడాలని ఆయన అన్నారు. తెలంగాణలో జరిగిన విధంగానే భారత దేశం కూడా డెవలప్ కావాలని అన్నారు. దేశం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాం అని ఆయన అన్నారు. ఏ విధంగా తెలంగాణ కోసం కొట్లాడామో.. ఈ భారత దేశంలో మంచిని పెంచడానికి, మంచిని పంచడానికి నా ప్రాణాన్ని ధార పోస్తానని అన్నారు. కులం, మతం అనేద దరిద్రమైన మాట అని అన్నారు. బుద్ది తక్కువ వెదవలు వాళ్ల స్వార్థం కోసం దేశాన్ని బలి చేస్తున్నారని అన్నారు. తెలంగాన మేధావులు దాన్ని తిప్పికొట్టాలని కోరారు. ఎక్కడి వాళ్లం అక్కడ గ్రామాల్లో చర్చ పెట్టాలని అన్నారు. రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి పంపితే.. నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేసీఆర్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news