బాలికపై ఇద్దరు వృద్ధులు లైంగిక దాడి.. గర్భం రావడంతో..

-

మృగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అన్యం పుణ్యం తెలియని చిన్నారుల నుంచి.. రేపో మాపో అన్నట్లుండే ముసలి వాళ్ళ వరకు ఎవ్వరినీ కామాంధులు విడవడం లేదు.. తమ కామ వాంఛ తీర్చుకోవడానికి అన్ని దారులు వాడుతున్నారు. అలాంటి ఘటనే ఇది.. ఓ గ్రామానికి చెందిన శ్రీరాం సుబ్బయ్య(55), భాస్కర్‌(60) క్షుద్ర పూజలు చేస్తుంటారు. అయితే.. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉన్నట్లు ఈ ఇద్దరు వృద్దులు బాలికను నమ్మించి.. తాము చెప్పినట్లు వినకపోతే తల్లిదండ్రులకు మరణం తప్పదని భయపెట్టారు. దీంతో భయపడిన బాలిక వారికి చెప్పినట్లు చేసింది.

ఈ నేపథ్యంలో మూడు నెలలుగా ఇద్దరూ సదరు బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. గత రెండు రోజులుగా బాలిక అనారోగ్యంతో బాధపడుతుండటాన్ని గమనించిన తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించగా అసలు విషయం బయటపడింది. దీంతో బాలికను ఒత్తిడి చేయగా శ్రీరాం సుబ్బయ్య, భాస్కర్‌ బాగోతం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలికతో పాటు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరు వృద్దులపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news