జనసేన, బిజెపి సపోర్టు లేకుండా చంద్రబాబు ఎన్నికల బరిలో దిగగలరా?: విడదల రజిని

-

టిడిపి నేత చంద్రబాబుకు సవాల్ విసిరారు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని. టీడీపీకి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అని ఆమె ప్రశ్నించారు. సామాజిక న్యాయ బేరి బస్సు యాత్రలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మీ ఓట్లు నాకు వేయండి.. మీ తలరాతను మారుస్తానని జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని నూటికి నూరు శాతం అమలు చేస్తున్నారని చెప్పారు.

అదే సమయంలో టిడిపి ఒంటరిగా పోటీ చేయగలదా అని ఆమె ప్రశ్నించారు. జనసేన, బిజెపి సపోర్టు లేకుండా 2024లో చంద్రబాబు బరిలో దిగగలరా? అని అడిగారు. వైసీపీ ని ప్రజలు ఓడించాలని చంద్రబాబు పిలుపు ఇస్తున్నారు అని, అసలు ప్రజలు జగన్ ని ఎందుకు ఓడించాలని ప్రశ్నించారు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా. కరోనా సమయంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నందుకా అని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news