క్రేజీ న్యూస్..నందమూరి హీరోతో SSMB28లో తలపడనున్న మహేశ్ బాబు?

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘‘సర్కారు వారి పాట’’ ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కినఈ సినిమాకు చక్కటి రెస్పాన్స్ వస్తోంది. మహేశ్ కామెడీ టైమింగ్, యాక్షన్, డ్యాన్స్ లు అన్నీ సూపర్బ్ గా ఉన్నాయని అభిమానులు అంటున్నారు.

ఈ క్రమంలోనే మహేశ్ చేయబోయే నెక్స్ట్ ఫిల్మ్స్ అప్ డేట్స్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే SSMB28 గురించి ఓ క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్ ప్రకారం.. ఈ చిత్రంలో మహేశ్ బాబు నందమూరి హీరోతో తలపడబోతున్నారట. అనగా..ఈ పిక్చర్ లో నందమూరి హీరో ఒకరు విలన్ గా నటిస్తున్నారని అంటున్నారు.

 

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో తారక రత్న పేరిట ఉన్న ఓ అకౌంట్ నుంచి SSMB28 అనే ట్వీట్ వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ మేరకు చర్చ నడుస్తోంది. ‘‘అమరావతి’’ చిత్రంలో చక్కటి నటన కనబర్చిన నందమూరి తారక రత్న..తో మహేశ్ కాంబో అదరిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

కాగా, ఈ సినిమాపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ చేస్తున్న హ్యట్రిక్ ఫిల్మ్ SSMB28. కాగా, ఈ సినిమా అప్ డేట్ కోసం సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రంలోనూ మహేశ్ కు జోడీగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆస్థాన హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news