కాశ్మీర్ పరిస్థితులు కోనసీమలో తీసుకువచ్చారు: చంద్రబాబు నాయుడు

-

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో ఇటీవల జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు , హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది ప్రభుత్వం. వారం గడిచినా ఇంకా ఇంటర్నెట్ పై నిషేధం కొనసాగుతోంది. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో వారం రోజులైనా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ  పాలనకు నిదర్శనం. ఎక్కడో కాశ్మీర్ లో వినిపించే ‘ఇంటర్నెట్ సేవలు నిలిపివేత’ అనే వార్త ను మన సీమలో వినాల్సి రావడం బాధాకరంమని అన్నారు. ఐటీ వంటి ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం…కనీసం వాళ్ళు పని చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చెయ్యడం దారుణం. ఇంటర్ నెట్ అనేది ఇప్పుడు అతి సామాన్యుడి జీవితంలో కూడా భాగం అయ్యిందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని సూచించారు. చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ ఆధారంగా నడిచే రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామని… ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయం.  మీ ఉదాసీనత వారికి ఇబ్బందిగా మారకూడదంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news