ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఇంటర్, డిగ్రీ అర్హతతో బ్యాంక్ జాబ్స్..

-

ఏపీ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేవ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో జాబ్ మేళా కు సంబంధించిన ప్రకటనను అధికారులు విడుదల చేశారు.. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. మొత్తం 75 ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. రిలేషన్ షిప్ ఆఫీసర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీలు, విద్యార్హతలు..

రిలేషన్ షిప్ ఆఫీసర్ విభాగంలో 75 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12,256 వేతనం ఉంటుంది. ఇంకా ఇన్సెంటీవ్స్ సైతం చెల్లించనున్నారు. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడలో పని చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థులకు టూ వీలర్ తప్పనిసరిగా ఉండాలి..

పూర్తీ వివరాలు..

అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 20న అంటే సోమవారం ఉదయం 10 గంటలకు D.No.43-16-23, సుబ్బలక్ష్మి నగర్, బాటా షోరూం ఎదురుగా, ఇండియా బ్యాంక్ పైన, దొండపర్తి-విశాఖపట్నం జిల్లా చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు ఫార్మల్ డ్రస్ ధరించాలి.

Resumeతో పాటు విద్యార్హతల జిరాక్స్ కాపీని వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

ఆధార్ తో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

ఇతర పూర్తి వివరాలకు 9908799126 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news