తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా 462 కేసులు..

-

ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలపై విరుచుకుపడుతున్న కరోనా రక్కసి.. ఇప్పుడు మరోసారి ప్రభావం చూపుతోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 25,518 కరోనా పరీక్షలు నిర్వహించగా, 462 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 259 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40, రంగారెడ్డి జిల్లాలో 35 కేసులు గుర్తించారు.

Coronavirus resiste nove giorni su superfici come metallo, vetro e plastica

అదే సమయంలో 403 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,01,406 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,92,593 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,702 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news