ఆయన ప్లాన్ ప్రకారమే.. జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరు బయటికి.. నిజమేనా..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ నుండి మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన ఎన్నో సినిమాలలో నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించినా.. అవి పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఆయన వెండితెర పైన పలు పాత్రలు పోషిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాంటి వాటిలో జబర్దస్త్, బొమ్మ అదిరింది, కామెడీ స్టార్స్ వంటి వాటికి జడ్జిలుగా వ్యవహరించారు.

అయితే ఆరెంజ్ సినిమాతో ఈయన కొన్ని కోట్ల రూపాయలను పోగొట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ తరువాత నిర్మాణ బాధ్యతలకు గుడ్ బై చెప్పేసి బుల్లితెరపై మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాజకీయంగా కూడా తన సోదరుడు అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపు నుంచి 2019 వ సంవత్సరంలో నరసాపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరిగింది. ప్రస్తుతం రాజకీయంగా కూడా బాగానే యాక్టివ్ గా ఉన్నారు నాగబాబు.

అయితే కొన్ని సంవత్సరాల క్రితం నాగబాబు జబర్దస్త్ నుంచి బయటికి రావడం జరిగింది. అలా కొన్ని రోజుల తర్వాత పలు షో లలో , ఈవెంట్లలో బాగా కనిపిస్తూ సందడి చేయడం జరిగింది నాగబాబు. ప్రస్తుత స్టార్ మా కామెడీ షో లలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. నాగబాబుకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. తరచూ తనకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక అసలు విషయంలోకి వెళితే నాగబాబు జబర్దస్త్ లో కొంతమంది కమెడియన్లను తన వైపుకు తిప్పుకున్నాడని వార్త బాగా వైరల్ గా మారుతుంది. దీంతో ఆ కమెడియన్లు అంతా జబర్దస్త్ నుండి బయటికి వచ్చి నాగబాబు చేస్తున్నటువంటి షోలలో పాల్గొనడం జరుగుతుంది.

అలాంటి వారిలో ముందుగా సుదీర్, అప్పారావు, అదిరే అభి, గెటప్ శ్రీను తదితరుల తో పాటు యాంకర్ అనసూయ కూడా ఇటీవలే జబర్దస్త్ ను వదిలి స్టార్ మా లో అడుగుపెట్టినట్లు సమాచారం. అయితే వీరందరూ కేవలం నాగబాబుని అనుసరించే ఇందులోకి ఎంట్రీ ఇచ్చారని బాగా వినిపిస్తోంది. మరి ఈ విషయంపై నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news