జగన్‌ ఇంట్లో ద్రౌపది ముర్ము తేనేటి విందు..

-

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ఏపీ పర్యటనలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం మధ్యాహ్నం ఏపీకి విచ్చేశారు. అనంతరం ద్రౌపది ముర్ము.. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వారసత్వ కట్టడాలకు ఆంధ్రప్రదేశ్‌ నిలయం. ఆంధ్రప్రదేశ్‌కు ఘనమైన చరిత్ర ఉంది.

A tribal and a woman, Draupadi Murmu gives power to presidential race

ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారు. ఈక్రమంలో తెలుగు కవులైన నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడలను ముర్ము స్మరించుకున్నారు. అయితే ఈ సమావేశం అనంతరం ఆమె ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసి… తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే.. ద్రౌపది ముర్ముకు వేదఆశీర్వచనం ఇచ్చి, ప్రసాదాలు అందించారు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం వేదపండితులు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డి ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news