BREAKING: రాజమండ్రికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

-

తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రికి చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాసేపటి క్రితమే రాజమండ్రి ఎయిర్ పోర్టు కు చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మండపేటలో జరిగే కౌలు రైతు భరోసా యాత్ర లో పాల్గొనడానికి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వెళ్లారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం పలికారు జనసేన శ్రేణులు.

ఎయిర్ పోర్ట్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్ళిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మధ్యాహ్నం 3గంటలకు మండపేట బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, పార్టీ తరపున ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించనున్న పవన్ కళ్యాణ్.. రాజమండ్రి నుంచి మండపేట వచ్చే మార్గ మధ్య లో ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు కౌలు రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 54 కౌలు రైతు కుటుంబాలకు జనసేన పార్టీ తరుఫున ఆర్థిక సాయం చేయనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news