హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం ?

-

టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్‌ సమంత.. ప్రస్తుతం దేశ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ సినిమాతో ప్రేక్షకుల గుండెలను మాయ చేసింది. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న సమంత ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఇకపోతే తన నటనతో, అమాయకత్వంతో, చిలిపిచేస్టలతో స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న సమంత ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా.. సమంత సినిమాలతో బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలోనే సమంత సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇటీవల సమంత ఇన్‌ స్టా గ్రామ్‌ హ్యాక్‌ అయింది. అప్పుడే.. సమంత ఇన్‌ స్టాలో కేటీఆర్‌ పిక్‌ దర్శనమిచ్చింది. దీంతో హ్యాక్‌ అయినట్లు సమంత… సిబ్బంది గుర్తించారు. ఇక ఈ సంఘటన జరిగినప్పటి నుంచి సమంత సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. మొదట షూటింగ్స్‌ పై ఫోకస్ చేయాలని నిర్ణయం తీసుకున్నారని టాక్‌.

Read more RELATED
Recommended to you

Latest news