Breaking: నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు కరోనా

-

నటి వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వరలక్ష్మి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించింది. గత రెండు, మూడు రోజులుగా తనతో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించింది. ఇక ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె పోస్ట్ కు డైరెక్టర్ గోపీచంద్ మలినేని కామెంట్ చేశారు.

కోలీవుడ్ స్టార్ యాక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నారు. క్రాక్, నాంది వంటి సినిమాలతో మంచి పేరును సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తుండడంతో ఈ బ్యూటీ చెన్నై నుంచి హైదరాబాద్ కు కొద్ది రోజుల క్రితమే మకాం మార్చారు.

Read more RELATED
Recommended to you

Latest news