కేటీఆర్‌ కాలికి గాయం.. వైఎస్ షర్మిల సెటైర్ !

-

తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు సూచించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇవాళ కింద పడిపోయాను. దీంతో ఎడమ కాలి మడమకు గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ సమయంలో విలువైన ఓటీటీ షోలు చూడటానికి మీ సలహా ఇస్తారా? అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

అయితే.. కేటీఆర్‌ గాయంపై వైఎస్‌ షర్మిల సెటైర్‌ వేశారు. మీరు ఇంట్లో కూర్చుని సినిమాలు చూడండి. క్లౌడ్‌ బరస్ట్‌ అని తెరపైకి తీసుకువచ్చి, వరదలను తప్పుదొవ పట్టించారని మండిపడ్డారు. అలాగే.. మంత్రి కేటీఆర్‌ గారూ త్వరగా కోలుకోవాలని ఆయన ఫోటోను షేర్‌ చేశారు వైఎస్‌ షర్మిల. ఇక వరదలతో జనాలు ఆగం అవుతూంటే, నీకు సినిమాలు కావాల్సి వచ్చిందా అని నెటిజన్లు కూడా కేటీఆర్‌ కు కౌంటర్‌ ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news