సీఎం కేసీఆర్‌ పై పోటీ చేస్తా..ఓడిస్తా – ఈటల శపథం

-

సీఎం కేసీఆర్‌ పై పోటీ చేస్తా..ఓడిస్తానని ఈటల రాజేందర్‌ శపథం చేశారు. మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ జెండా ఎగురవేసి జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు ఈటల కు ఖడ్గం బహూకరించారు. పలువురికి ఈటల రాజేందర్ కాషాయ జెండా కప్పి బీజేపీ లోకి స్వాగతం పలికారు.

అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి చేస్తా అని కెసిఆర్ మాట తప్పారని.. అనేక అంశాలు మానిఫెస్టో లో రాసుకొని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన వ్యక్తి కెసిఆర్ అని నిప్పులు చెరిగారు.

ప్రభుత్వ హామీలు, వైఫల్యాల ను ఎండగట్టేందుకు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా నేను దేవరకద్ర వెళ్తున్నానని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మా ఆక్షన్ ప్లాన్ ఉంటుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎగరేది బీజేపీ జెండానేనని పేర్కొన్నారు. ఇప్పుడు రోజులు బాగా లేవు… 27 తరువాత బీజేపీలో చేరికలు ఉంటాయని సంచలన ప్రకటన చేశారు. తెరాస, కాంగ్రెస్ పార్టీ వారు చాలామంది టచ్ లో ఉన్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news