వ్యభిచారం అంటూ హిజ్రాకు బెదిరింపులు… అంతలోనే !

-

ఆన్లైన్ వ్యభిచారం నడిపిస్తున్నారంటూ ఓ హిజ్రా ఇంటికి వెళ్లిన నలుగురు విలేకరులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు భారత్ తెలుగు న్యూస్ లో న్యూస్ రిపోర్టర్ పి.సాయి కిరణ్ రాజు, టిజి 24/7 న్యూస్ రిపోర్టర్ కే.సంపత్ విజయ్ కుమార్, యాకూబ్ పాషా, రిపోర్టర్ కే.ప్రశాంతి తదితరులు ఆదివారం అర్ధరాత్రి వెంకటగిరి సమీపంలోని హైలం కాలనీలో నివసించే హిజ్రా (26)ఇంటికి వెళ్లారు.

ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు అంటూ ఆమెతో చెప్పగా, అందుకు సదరు హిజ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి వాగ్వాదానికి దిగింది. రూ.2 లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా, తన సెల్ ఫోన్లు ద్వంసం చేశారని బాధిత హిజ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు విధాల బెదిరించడంతో బాధితురాలు సహచర హిజ్రాలతో కలిసి ఈ నలుగురు విలేకరులను చితకబాది పోలీసులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news