మునావర్ ఫరుఖి షో కు అనుమతి ఇవ్వద్దని డీజీపీని కలిసిన బీజేవైఎం

-

ప్రముఖ స్టాండప్ కమెడియన్ మనవర్ ఫారూఖి షోకు అనుమతి ఇవ్వద్దని తెలంగాణ డిజిపిని కలిశారు బీజేవైఎం నాయకులు. ఆగస్టు 20వ తేదీన హైదరాబాదులో స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫరుఖి కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. అయితే దీనికి అనుమతి ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది. గతంలో మునావర్ హిందూ దేవుళ్ళపై జోకులు వేశారని.. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని బిజెపి ఆరోపిస్తోంది.

అయితే ఆగస్టు 20వ తేదీన హైదరాబాదులో డోంగ్రి టు నోవెన్ షో ఉందని.. ఫరూ కి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించాడు. ఈ షో కి సంబంధించి టికెట్లను బుక్ మై షో లో ఇప్పటికే విక్రయిస్తున్నారు. అయితే ఈ షో ద్వారా హిందువులకు వ్యతిరేకంగా.. కమ్యూనల్ ఇష్యూ జరుగుతోందని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు బీజేవైఎం నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news