BREAKING: కుప్పంలో అన్న క్యాంటీన్ వద్ద రోడ్డుపై ధర్నాకు కూర్చున్న చంద్రబాబు

-

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నియోజక వర్గం అయిన కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేశారు వైసీపీ పార్టీ కార్యకర్తలు. అక్కడితో ఆగకుండా.. టీడీపీ నేతల ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు వైసీపీ నేతలు. కుప్పం బంద్ కు వైసిపి పిలుపునివ్వడంతో.. వ్యాపారులు వారి దుకాణాలను మోసేశారు. ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.

కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పలుచోట్ల భారీకేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసాయి. కుప్పంలో చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు వైసిపి కార్యకర్తలు. టిడిపి, వైసీపీలో పోటాపోటీగా నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతుండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్ వద్ద రోడ్డుపై ధర్నాకు కూర్చున్నారు నారా చంద్రబాబు నాయుడు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news