2.ఓ టీజర్ పోస్టర్.. సౌండ్ లేదంతే

-

సీక్వల్ సినిమాల్లో ఆడియెన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమా 2.ఓ. శంకర్, రజినికాంత్ కాంబినేషన్ లో 450 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా 2.ఓ. కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఈసారి అనుకున్న టైం కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక అంతకుముందే శాంపిల్ గా 2.ఓ టీజర్ సెప్టెంబర్ 13న రిలీజ్ అవనుంది.

వినాయక చవితి సందర్భంగా 2.ఓ టీజర్ వస్తుంది. దీనికి సంబందించిన పోస్టర్ రిలీజ్ చేశారు. టీజర్ పోస్టర్ కూడా ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చిందని చెప్పొచ్చు. రజినికి విలన్ గా అక్షయ్ కుమార్ నటిస్తున్న ఈ సినిమాలో రజిని సరసన అమీ జాక్సన్ నటిస్తుంది. ఈ పోస్టర్ చూసిన ప్రేక్షకులు మాటల్లేవంతే అంటున్నారు.

హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా వస్తున్న 2.ఓ ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకు నమోదైన రికార్డులన్నిటిని బ్రేక్ చేయాలని ఫిక్స్ అయ్యింది. సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news