ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్..1000 కి 6000!

-

ఆసియా కప్ లో భాగంగా ఇవాళ టీమిండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్ కొనసాగుతోంది.

బెట్టింగ్ లో హాట్ ఫెవరెట్ గా ఇండియా నిలువగా… పాకిస్థాన్ పై 1000 రూపాయలు బెట్ వేస్తే… 2800 రూపాయలు ఇస్తున్నారు. ఇక ఇండియా పై 1000 రూపాయలు బెట్ వేస్తే… 1450 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు.

ఏ ప్లేయర్ ఎన్ని రన్స్ చేస్తాడు… ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు… టాప్ స్కోరర్ గా ఎవరు ఉంటారు… టాప్ వికెట్ టేకర్ గా ఎవరు… ఏ ఓవర్ లో ఎన్ని రన్స్ చేస్తారు… బాల్ టు బాల్… బెట్టింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ టాస్ విన్ అయి మ్యాచ్ ఇండియా విన్ అయితే 1000 కి 2750 అని.. టాస్ మరియు మ్యాచ్ పాక్ విన్ అయితే 1000 కి 5000 ఇస్తున్నారు. ఇక టాస్ మరియు మ్యాచ్ ఇండియా విన్ అయితే 1000 కి 6000 ఇచ్చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news