హరీష్ రావు చాలెంజ్ కు నిర్మల సీతారామన్ భయపడింది – మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

హరీశ్ రావు ఛాలెంజ్ కు భయపడి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకుందన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిర్మలా హయాంలో రూపాయి విలువ విపరీతంగా పడిపోయిందన్నారు. కేసీఆర్ ను చూసి బీజేపీ వణికిపోతోందన్నారు ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ రాష్ట్రం దాటి బయటకు వస్తే వైఫల్యాలు బయట పడతాయని కేంద్రం భయపడుతుందన్నారు. అందుకే కేంద్ర మంత్రులు గడికి ఒకరు వస్తున్నారని అన్నారు. నిర్మలా సీతారామన్ మాట్లాడినవి అన్నీ అబద్ధాలేనన్నారు.

గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ ల్లో ఒక్క రూపాయి కేంద్రం సొమ్ము లేదన్నారు. ఫసల్ బీమా యోజన గుజరాత్ లోనే అమలు చేయడం లేదని విమర్శించారు. ఈరోజు నిర్మలా సీతారామన్ బెదిరింపు ధోరణిలో మాట్లాడిందని.. రేషన్ షాపు లో నరేంద్ర మోదీ ఫోటో లేదని గొడవ పెట్టుకున్నారని అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు తెలంగాణ సొమ్ము వాడారు కాబట్టి కేసీఆర్ ఫోటో పెట్టగలరా? అని ప్రశ్నించారు.

ఆహార భద్రత చట్టం కింద కేంద్రం రాష్ట్రాలకు బియ్యం ఇవ్వడం ప్రజల హక్కు అన్నారు. 3.65లక్షల కోట్ల పన్నులు తెలంగాణ రాష్ట్రం వచ్చాక చెల్లించామన్నారు. కేంద్రం నుంచి 1.6 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇచ్చారని తెలిపారు. బీహార్, యూపీ, గుజరాత్ లకు కనీసం లక్ష కోట్లు మా డబ్బు వినియోగించారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news